హీరో సూర్య ఇటీవలి కాలంలో హిట్స్ అందుకోలేకపోతున్నాడు. దీంతో నెక్ట్స్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. వరుస హిట్స్ అందుకుంటూ దూసుకెళుతున్న వెంకీ అట్లూరి కాంబోలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సూర్య 46గా ఈ చిత్రం రూపొందనుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ ప్రతిష్టాత్మక ద్విభాషా చిత్ర షూటింగ్ ను నేడు మేకర్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా “వేడుక, భావోద్వేగం, వినోదం వైపు తొలి అడుగు” అంటూ సూర్య ముందుకి అడుగు వేస్తున్న అద్భుతమైన పోస్టర్ను చిత్ర బృందం పంచుకుంది.
తమిళ కథానాయకుడు అయినప్పటికీ పలు సంవత్సరాల నుంచి తెలుగు ప్రేక్షకుల ప్రేమను కూడా పొందుతున్న సూర్య.. ఇప్పుడు సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెం.33 తో తమిళ, తెలుగు అభిమానులను మరింతగా అలరించడానికి సిద్ధమవుతున్నారు. లోతైన భావోద్వేగాలను, వాణిజ్య అంశాలను మిళితం చేస్తూ ప్రస్తుత తరంలో గొప్ప కథకులతో ఒకరిగా పేరు పొందారు దర్శకుడు వెంకీ అట్లూరి. గత రెండు చిత్రాలు (సార్(వాతి), లక్కీ భాస్కర్’ ఘన విజయాలను సాధించి.. దర్శకుడిగా వెంకీ అట్లూరి స్థాయిని మరింత పెంచాయి. ఈ సినిమాలో ‘ప్రేమలు’తో ఆకట్టుకున్న యువ సంచలనం మమిత బైజు కథానాయికగా నటిస్తుండగా.. రవీనా టాండన్ తెలుగు సినీ పరిశ్రమకు తిరిగి వస్తున్నారు. రాధిక శరత్కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సార్(వాతి), లక్కీ భాస్కర్ చిత్రాలతో తన సంగీతంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన జీవీ ప్రకాష్ కుమార్.. మరోసారి వెంకీ అట్లూరితో చేతులు కలిపారు.
ప్రజావాణి చీదిరాల