హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ మధ్య జరిగిన ఐపీఎల్ 51 వ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా జరిగింది. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. గుజరాత్ ఓపెనర్స్ సాయి సుదర్శన్ 23 బంతుల్లో 48 పరుగులు ( 9 ఫోర్లు, శుభమన్ గిల్ 38 బంతుల్లో 76 పరుగులు ( 10 ఫోర్లు 2 సిక్సర్లు) విజృంభించటంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 6.5 ఓవర్లు ముగిసే సరికి 87 పరుగుల వద్ద సాయి సుదర్శన్ పెవిలియన్ చేరాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన జోష్ బట్లర్ 37 బంతుల్లో 64 పరుగులు (3 ఫోర్స్ 4 సిక్సర్లతో) గిల్ తో కలిసి పరుగుల ప్రవాహాన్ని కొనసాగించాడు. స్కోర్ బోర్డు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 224 పరుగులు చేరుకుంది. ఎస్ ఆర్ హెచ్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ వేసిన చివరి ఓవర్లో 3 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ జట్టు 16 బంతుల్లో 20 పరుగులు ( 4 ఫోర్లు) , అభిషేక్ శర్మ 41 బంతుల్లో 74 పరుగులు చేసి ( 4 ఫోర్స్ 6 సిక్సర్లు) హైదరాబాద్ ఆశలను సజీవంగా ఉంచాడు. అభిషేక్ శర్మ అవుట్ అయ్యాక ఆ ఆశలు కాస్త అడియాసలు అయ్యాయి. తర్వాత వచ్చిన వారు మాత్రం ఒక్కరు కూడా పెద్దగా రాణించలేని స్థితిలో సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఉండటంతో గుజరాత్ గెలుపు ఖాయమైంది. 38 పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టు పై గుజరాత్ ఘన విజయం సాధించింది. హైదరాబాద్ జట్టు ప్లేయర్ అభిషేక్ శర్మ మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.