రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మరికొన్ని గంటల్లో ఫస్ట్ షాట్‌

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘పెద్ది’.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వృద్ధి సిన‌మాస్ బ్యాన‌ర్‌పై వెంక‌ట స‌తీష్ కిలారు

ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి.

మాస్ గెటప్‌లో రామ్ చరణ్ కనిపిస్తున్నాడు. ఈ సినిమా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంది.

ఈ సినిమా నుంచి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ వస్తూనే ఉన్నాయి.

తాజాగా ఈ సినిమా నుంచి శ్రీరామనవమి కానుకగా గ్లింప్స్ విడుదల కానున్నాయని చిత్రయూనిట్ వెల్లడించింది.

ఫస్ట్ షాట్ పేరుతో విడుదల కానున్న ఈ గ్లింప్స్ కోసం మిక్సింగ్ పూర్తైందంటూ

ఏఆర్ రెహ్మాన్‌తో బుచ్చిబాబు సాన ఉన్న పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రజావాణి చీదిరాల

Also Read This : ఏమై ఫాలింగ్ ఇన్ టు ద లవ్ అని స్టేటస్ పెట్టనా..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *