హీరోయిన్ దీపికా పదుకొణెకు బంపరాఫర్ వరించింది. ఇప్పటికే ఈ న్యూస్ తెగ వైరల్ అయ్యింది కానీ కన్ఫర్మా.. కాదా? అనేది మాత్రం ఎవరికీ తెలియదు. దీనికి సంబంధించి ఇవాళ క్లారిటీ వచ్చేసింది. అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబోలో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్గా నటించనుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ప్రి ప్రొడక్షన్ వర్క్ అంతా చివరి దశకు చేరుకుందట. త్వరలోనే పట్టాలెక్కనుందని సమాచారం. ఈ క్రమంలోనే ఇవాళ ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని రూ.700 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తోంది. అల్లు అర్జున్ పుట్టినరోజును పురస్కరించుకొని ఏప్రిల్ 8న టీమ్ దీనిని అధికారికంగా ప్రకటించింది.