...

కాంగ్రెస్ కు కత్తిమీద సాములా అభ్యర్థుల ఎంపిక

2024 Loksabha Elections :

మిగిలిన నాలుగు లోక్ సభ స్థానాలకు తీవ్రంగా పోటీ

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ టికెట్లకు డిమాండ్ బాగా పెరిగింది. అధికార పార్టీగా ఎక్కువ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండడంతో చాలా మంది నేతలు కాంగ్రెస్ టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. అయితే గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం.. ఇప్పటివరకు 13 సీట్లకు ఆచితూచి నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కూడా టికెట్లు ఇచ్చింది. ఈ జాగ్రత్తలో భాగంగానే మరో నాలుగు సీట్ల విషయంలో తీవ్రమైన కసరత్తు చేస్తోంది. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పెండింగ్ లో ఉండగా.. టికెట్ మాకు కావాలంటే.. మాకు కావాల్సిందేనంటూ పార్టీలోని బడా నేతలే పట్టుబడుతున్నారు. మరోవైపు సందట్లో సడేమియాలాగా కొత్త వ్యక్తులు కూడా సీన్‌లోకి ఎంటరవుతున్నారు.

ఈ 4 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటి సోమవారం సాయంత్రం ఢిల్లీలో భేటీ కానుంది. కాగా, ఖమ్మం సీటు కోసం ముగ్గురు మంత్రుల కుటుంబాలు పోటీ పడుతున్నాయి. వారిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుటుంబం నుంచి తుమ్మల యుగంధర్ ఉన్నారు.

ఈ ముగ్గురిని కాదని కాంగ్రెస్ నేత వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ కొత్తగా తెరపైకి వచ్చారు. దీంతో ఎవరినీ నొప్పించకుండా మంత్రుల కుటుంబాలను కాదని వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ కు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే మంత్రి పొంగులేటి నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో మధ్యే మార్గంగా ఆయన వియ్యంకుడు రామసహాయం సురేందర్ రెడ్డి పేరు కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

 

ఢిల్లీలో జరుగుతున్న కసరత్తు..రేపు ప్రకటించే అవకాశం

వరంగల్ స్థానం కోసం కాంగ్రెస్ అధిష్ఠానం సుదీర్ఘ కసరత్తు నిర్వహించనున్నట్లు చెబుతున్నారు. ఇక్కడినుంచి సీనియర్ నేత దొమ్మాటి సాంబయ్య, డాక్టర్ పరమేశ్వర్, బీఆర్ఎస్ నుంచి ఇటీవంలే కాంగ్రెస్ లో చేరిన సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ సహా పలువురు నేతలు టికెట్ ఆశిస్తున్నారు. తాజాగా కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కడియం కావ్యకు టికెట్ ఇస్తారన్న హామీ మేరకే తండ్రీకూతుళ్లు కాంగ్రెస్ లో చేరారన్న ప్రచారం ఉంది. అయితే కాంగ్రెస్ నుంచి మాదిగ సామాజికవర్గానికి ఎక్కడా టికెట్ ఇవ్వనందున.. వరంగల్ టికెట్ ను మాదిగ వర్గానికి ఇవ్వాలని మాదిగ జేఏసీ డిమాండ్ చేస్తోంది.

కడియం కుటుంబం బైండ్ల సామాజికవర్గానికి చెందినవారు కావండంతో.. వారిని మాదిగ వర్గంగా పరిగణించకూడదని అంటోంది. దీంతో ఇది కొంత వివాదాస్పదంగా మారింది. ఇక కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, సంతోష్ కుమార్ టికెట్ ఆశిస్తున్నారు. తీన్మార్ మల్లన్న పేరు కూడా తాజాగా తెరపైకి వచ్చింది. స్నాబాద్ స్థానాన్ని అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొన్నం ప్రభాకర్ కోసం ప్రవీణ్ రెడ్డి వదులుకున్నారు. ముగ్గురిలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతోందన్నది ఆసక్తికరంగా మారింది. అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తున్న హైదరాబాద్ స్థానం కోసం టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో పాటు షానవాజ్ తుబుసం పేర్లను పరిశీలిస్తున్నారు. పెండింగ్ లో ఉన్న ఈ నాలుగు స్థానాలతో పాటు సికింద్రాబాద్ అభ్యర్థి మార్పుపై చర్చించే అవకాశం ఉంది. దానం నాగేందర్ పేరును అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి ఎమ్మెల్యే పదవికి దానం నాగేందర్ రాజీనామా చేయలేదు. ఆయనను మార్చే పక్షంలో పరిశీలనలో బొంతు రామ్మోహన్ సహా మరికొందరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

Also Read This Article : నరసాపురం ఎంపీగానే రఘురామ కృష్ణంరాజు పోటీ?

 

IS EVM HACKING POSSIBLE ?
IS EVM HACKING POSSIBLE ?

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.