యూపీలోని ప్రయాగరాజ్ లో జరుగుతున్నా మహాకుంభమేళాలో తన కళ్లతో ఆకట్టుకుని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన మోనాలిసా భోంస్లేకు బంపరాఫర్ వచ్చింది.
ఆమెకు ఏకంగా బాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చేసింది.
బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత సనోజ్ మిశ్రా తన కొత్త సినిమాలో మోనాలిసాను తీసుకోబోతున్నారు.
తన అందానికి, కళ్ళతో కనిపించే అమాయకత్వానికి తాను ఫిదా అయిపోయానని సనోజ్ మిశ్రా తెలిపారు.
ఆమెకు తన కొత్త సినిమాలో అవకాశం ఇవ్వనున్నట్లుగా వెల్లడించారు.
మోనాలిసాను కలిసేందుకు త్వరలోనే తాను ప్రయాగ్ రాజ్ కు వెళ్లనున్నట్లుగా వెల్లడించారు.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన మోనాలిసా భోంస్లే కుటుంబం తరతరాలుగా పూసలదండలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది.
కుటుంబానికి తోడుగా మోనాలిసా కూడా చిన్నప్పటి నుంచి పూసలదండలు అమ్ముతుంది.
ఈ క్రమంలోనే ప్రయాగ్ రాజ్ కు పూసలదండలు అమ్మడానికి వచ్చింది.
దీంతో ఇక్కడ ఆమె అమాయకపు చూపులకు చాలా మంది ఫిదా అయిపోయారు.
ఆమె ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.
ఈ ఫోటో చూసిన సనోజ్ మిశ్రా ఆమె అందానికి ఫిదా అయిపోయారు.
‘ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్’, ‘రామ్ కి జన్మభూమి’ చిత్రాలకు ప్రసిద్ధి చెందిన దర్శకుడు మిశ్రా తన తదుపరి చిత్రానికి మోనాలిసాకు ఎలాంటి పాత్ర ఇస్తారో చూడాలి.
మోనాలిసా భోంస్లే ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడం ఆమెకు శాపంగా మారిందన్న ప్రచారం కూడా నడుస్తోంది.
ఆమె అందం జీవనోపాధిని దెబ్బతీసే విధంగా మారిందని అంటున్నారు.
ఈ క్రమంలో మోనాలిసా తన స్టాల్ చుట్టూ జనాలు గుమిగూడటంతో ఆమె తండ్రి.. ఆమెను తన సొంతూరికి తీసుకువెళ్లాడని తెలుస్తోంది.
కాగా ఈనెల 13వ తేదీన ప్రారంభం అయిన మహా కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ వరకు 45 రోజులపాటు సాగనుంది.
సంజు పిల్లలమర్రి
Also Read This : ఫిబ్రవరి 15 న సిద్ శ్రీరామ్ లైవ్ కాన్సర్ట్… ఎక్కడంటే…?