మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆ తరుణం రానే వచ్చింది. ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో చిత్రం పట్టాలెక్కేందుకు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఆదివారం ఎన్టీఆర్ కర్ణాటకకు ఫ్లైట్ ఎక్కేశాడు. ఇటీవల ‘ఎన్టీఆర్ నీల్’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా ప్రారంభమైంది. అసలు ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. నాటి నుంచి ఎన్టీఆర్ సెట్స్లోకి అడుగు పెడతాడా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఏప్రిల్ 22 నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. కర్ణాటక తొలి షెడ్యూల్ షూటింగ్ జరుగనుంది. ఈ తొలి షెడ్యూల్లోనే ఎన్టీఆర్ పాల్గొంటున్నాడు. దీనికోసం నేడు కర్ణాటకకు బయలుదేరాడు. ఎన్టీఆర్-నీల్ కాంబో వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇది సినీ ఇండస్ట్రీలో సరికొత్త మైలురాయిని క్రియేట్ చేయనుంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్పై నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రజావాణి చీదిరాల