గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సాన కాంబోలో ‘పెద్ది’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. మరోసారి రామ్ చరణ్ ఊరమాస్ లుక్లో కనిపించనున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ సినిమా రేంజ్ను ఓ లెవల్కి పెంచేసింది. అయితే ఈసినిమా గురించి ఆసక్తికర వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా క్లైమాక్స్కు సంబంధించిన న్యూస్ అది. ఇప్పటికే మూడు షెడ్యూళ్లు పూర్తి చేసుకోవడంతో ముందుగానే క్లైమాక్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే రెండు ఆసక్తికర వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తొలి మూడు షెడ్యూళ్లు.. మైసూర్, హైదరాబాద్, మారేడుమిల్లి ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించిన బుచ్చిబాబు క్లైమాక్స్ కోసం ఆంధ్రాను ఎంచుకున్నారనేది ఒక వార్త. మరొకటేంటంటే.. క్లైమాక్ష్ కోసమో.. లేదంటే సినిమాలోని ఇతర సన్నివేశాల కోసమో తెలియదు కానీ ఉత్తరాంధ్ర యాస మాట్లాడగలిగిన కొందరు నటుల్ని సినిమా కోసం ఎంపిక చేసుకున్నారట. వాస్తవ వాతావరణం, యాస వంటి విషయాల్లో బుచ్చిబాబు చాలా జాగ్రత్త తీసుకుంటున్నారట. నేచురల్గానే ముందుకు వెళుతున్నారట. ఈ క్లైమాక్స్ వచ్చేసి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరగనుందట. దాదాపుగా ఈ క్లైమాక్స్లోనే ఉత్తరాంధ్ర వాసులు కనిపిస్తారని సమాచారం.
Also Read This : చెన్నై నడ్డి విరిచిన హర్షల్ పటేల్