...

AP POLITICS NEWS:వంగవీటి వారసుడికి సీటు లేద

 

AP POLITICS NEWS:

ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. ఓవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ‘సిద్ధం’ అంటూ సమర భేరి మోగిస్తుంటే.. టీడీపీ-జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏకంగా అభ్యర్థుల జాబితానే విడుదల చేసేశారు. దీంతో రాజకీయం మరింత రసకందాయంలో పడింది. ఏపీలో గత ఎన్నికలకు సంబంధించి 2019 మార్చి 10న షెడ్యూల్ వెలువడింది. ఏప్రిత్ 11న ఎన్నికలు జరిగాయి. మే 23న ఫలితాలు వెలువడ్డాయి. దాదాపు ఈ సారి కూడా అదేవిధంగా ఎన్నికల తేదీలు ఉంటాయి. మరోవైపు శనివారం టీడీపీ-జనసేన వెల్లడించిన జాబితాలో ఓ గమనించదగిన విషయం ఉంది.

TDP-Janasena alliance
మొన్న సీటు లేదు.. నేడు టికెట్ లేదు

విజయవాడ అంటే ముందుగా గుర్తొచ్చేది వంగవీటి మోహన రంగా. ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ, నాలుగేళ్లలోపే ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, చనిపోయి 35 ఏళ్లు దాటినప్పటికీ రంగా పేరు ఇప్పటికీ ఏపీలో మార్మోగుతూనే ఉంటుంది. అంతటి కరిష్మా ఉన్న వంగవీటి రంగా వారసుడిగా సరిగ్గా 20 ఏళ్ల కిందట రాజకీయాల్లోకి వచ్చారు ఆయన కుమారుడు రాధాక్రిష్ణ. 2004లో కేవలం 26 ఏళ్ల వయసులో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అటుపై మాత్రం ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్దంటున్నా.. ఆయనతో విభేదించి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీచేసి 750 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014లో విజయవాడ తూర్పు నియోజకవర్గానికి మారినా.. వైసీపీ నుంచి బరిలో దిగినా పరాజయమే ఎదురైంది. 2019 వరకు వైసీపీలోనే కొనసాగి.. జగన్ పాదయాత్రలోనూ పాల్గొన్న రాధా.. సెంట్రల్ టికెట్ ఇవ్వరని తేలిపోవడంతో అనూహ్యంగా టీడీపీలో చేరారు. రాధా మొదటినుంచి సెంట్రల్ టికెట్ పైనే పట్టుబట్టారు. కానీ, టీడీపీ జాబితాలో ఆ సీటును గత ఎన్నికల్లో 25 ఓట్ల తేడాతో ఓడిపోయిన బోండా ఉమాకు కేటాయించారు.

రాధా.. కిం కర్తవ్యం?

ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో మైలవరం, విజయవాడ పశ్చిమ, అవనిగడ, కైకలూరు, పెనమలూరు సీట్లకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో రెండు సీట్లలో జనసేన పోటీ చేస్తుందని సమాచారం. మరి వీటిలో రాధాకు టికెట్ ఎక్కడ ఇస్తారో చూడాలి. అసలు టికెట్ వస్తుందా? అంటే అది చెప్పడం కష్టమే. మరోవైపు రాధాకు ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బాగా సన్నిహితులు. వీరిద్దరూ ఏపీ సీఎం జగన్ కు అత్యంత నమ్మకస్తులన్న సంగతి తెలిసిందే. రాధా విషయంలో జగన్ ఇప్పటికీ సానుకూలతో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాధా అడుగులు ఎటువైపు అన్నది చూడాలి.

 

Also Read: Famous Telugu Producers : చాపకిందనీరులా తమిళంలోకి తెలుగు నిర్మాతలు…

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.