సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో అల్లరి నరేష్, అమృత అయ్యర్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం “బచ్చలమల్లి” చిత్రం ఈ నెల 20 ప్రేక్షకుల ముందుకి రానుంది.
సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ : ”డైరెక్టర్ సుబ్బు గారు ఈ కథ చెప్పినప్పుడు సింగల్ సిట్టింగ్ లోనే ఓకే అయింది. కథ అంత అద్భుతంగా ఉంది.
ఇందులో హాస్యరసం తప్పా అన్ని వేరియేషన్స్ వున్నాయి.
నాంది తర్వాత డిఫరెంట్ సినిమాలని చేద్దామనుకున్నాను. అలా మంచి కంటెంట్ సినిమాల కోసం చూస్తున్న టైం లో ఈ సినిమా వచ్చింది. నిర్మాత రాజేష్ గారికి కూడా చాలా నచ్చింది.
ఆయన చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు.గమ్యంలో గాలి శీను ఎలా గుర్తుండిపోయాడో బచ్చల మళ్ళీ కూడా ఓ పదేళ్ళ పాటు గుర్తుండిపోతాడు.
బచ్చలమల్లి జీవితంలోకి కావేరి అనే అమ్మాయి ఎంటర్ అయిన తర్వాత ఆ అమ్మాయి కోసం మారుతాడు. ఆ మారే క్రమంలో తను చేసిన పాత తప్పులన్నీ ఎదురవుతుంటాయి.
ఫైనల్ గా తను ఏ వైపు టర్న్ తీసుకున్నాడు అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.అమృత అయ్యర్ చాలా షటిల్ గా పెర్ఫార్మ్ చేసింది.
తన క్యారెక్టర్ కి మంచి పేరొస్తుంది.అలానే సుడిగాడు 2 సినిమా ఈ సారి పాన్ ఇండియా లెవెల్ లో తీయాలి అనుకుంటున్నాం కాబట్టి ఇంకాస్త టైం పడుతుంది అన్నారు.
సంజు పిల్లలమర్రి
Also read this : అమెరికాలోని కనెక్టికట్ లో ‘తారకరామం ‘ బుక్ రిలీజ్..