హీరో అక్కినేని అఖిల్ వివాహం అత్యంత వైభవంగా జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున అఖిల్ వివాహం ఆయన ప్రియురాలు జైనబ్ రవ్జీతో జరిగింది. హైదరాబాద్లోని నాగార్జున నివాసంలోనే ఈ పెళ్టి వేడుకను నిర్వహించారు. ఈ వివాహానికి అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. చిరంజీవి కుటుంబం, రాజమౌళి తనయుడు కార్తికేయ, దర్శకుడు ప్రశాంత్ నీల్, నటుడు శర్వానంద్ తదితరులు పెళ్లి వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అఖిల్ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ నెల 8న రిసెప్షన్ వేడుకను పెద్ద ఎత్తున అన్నపూర్ణ స్టూడియోస్లో నిర్వహించనున్నారు. ఈ వివాహ విందుకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.