బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై నటించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా మే 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అదితి శంకర్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
‘‘నేను తమిళ్లో చేసిన తొలి చిత్రాన్ని చూసిన దర్శకుడు విజయ్ ‘భైరవం’లో క్యారెక్టర్ కోసం నన్ను సంప్రదించడంతో నేను ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇచ్చాను. ఇది నా తొలి సినిమా. అయితే లాంగ్వేజ్ పరంగా ఒక బ్యారియర్ ఉంటుందని ముందు అనుకున్నా కానీ మా డైరెక్టర్, రైటర్ సత్య చాలా హెల్ప్ చేయడంతో పెద్దగా కష్టం అనిపించలేదు. ఈ సినిమాలో నేను నా ఒరిజినాలిటీకి దగ్గరగా.. బోల్డ్ అండ్ హానెస్ట్గానూ.. బబ్లీగా ఉండే క్యారెక్టర్లో కనిపిస్తా. మా నాన్నగారితో కలిసి రామోజీ ఫిలిం సిటీ, తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్కి వచ్చిన నేను.. ఇప్పుడు నా సొంత సినిమా కోసం ఇక్కడికి వచ్చా. నాకు తెలుగులో వర్క్ చేయాలని ఎప్పటినుంచో ఉండేది.
మా నాన్నగారి ఇమేజ్ని ఒక గౌరవంగానే భావిస్తాను కానీ అది ఎప్పుడూ ఒత్తిడిగా తీసుకోను. ఇది రియల్లీ వెరీ ఫన్ ఎక్స్పీరియన్స్. మనోజ్ అన్న నాకు ముందే తెలుసు. ఆయన నన్ను సెట్లో చూసి ఇక్కడ ఏం చేస్తున్నావ్ అడగటంతో సినిమాలో నటిస్తున్నానని చెప్పాను. అది రియల్లీ ఫన్ మూమెంట్. సాంగ్ సూట్ సమయంలో ఫస్ట్ టైం సాయి గారిని కలిసాను. రోహిత్ గారు కూడా చాలా నైస్ పర్సన్. ఈ ముగ్గురూ తమిళ్ చక్కగా మాట్లాడతారు కాబట్టి ఈ జర్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగింది. ముగ్గురు అద్భుతంగా పెర్ఫాం చేశారు. ఇక నా తెలుగు ఫేవరెట్ మూవీ వచ్చేసి మగధీర. ఇది నేను థియేటర్లో చూసిన తొలి తెలుగు సినిమా. అలా రాజమౌళి గారికి,రామ్ చరణ్ గారికి నేను బిగ్ ఫ్యాన్ గా మారిపోయాను. మా నాన్నగారికి నేను చేస్తున్న సినిమాలు, వాటికి సంబంధించిన కథలు ఏమీ తెలియవు. మా అమ్మకు ప్రతిదీ చెప్తుంటాను. ఆయన సినిమాలతో బిజీ. ఆయన సినిమాని ఒక పసిపాప లాగా జాగ్రత్తగా చూసుకుంటారు. నా సినిమాలు మా నాన్నగారు చూడాల్సిందే.. ఆయనకి మరో ఆప్షన్ లేదు. ఆయన నా సినిమాలు చూడకపోతే ఆయనతో ఫైట్ చేస్తాను(నవ్వుతూ)
ప్రజావాణి చీదిరాల