‘ఎస్ఎస్ఎంబీ 29’ కీలక అప్‌డేట్ ఇచ్చిన సెంథిల్..

రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో ‘ఎస్ఎస్ఎంబీ 29’ రూపొందుతున్న విషయం తెలిసిందే. దీనికోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఆసక్తికర అప్‌డేట్స్ బయటకు వచ్చి సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా గురించి తాజాగా సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ స్పందించారు. గతంలో రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా చిత్రాలకు ఆయనే సినిమాటోగ్రాఫర్ కావడంతో ఈ సినిమాకు కూడా ఆయనే సినిమాటోగ్రాఫర్ అని అంతా భావించారు. కానీ తాను మహేష్, రాజమౌళి కాంబో కోసం వర్క్‌ చేయడం లేదని సెంథిల్ తెలిపారు. ఈ సినిమాకు అందరూ కొత్త వాళ్లకే అవకాశం ఇవ్వాలని రాజమౌళి నిర్ణయించుకున్నారని సెంథిల్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇక సినిమాకు సంబంధించిన సన్నివేశాలను కెన్యాలో చిత్రీకరించాలని భావించారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *