...

మోహన్ లాల్ వర్సెస్ అజయ్ దేవగణ్.. నెగ్గేదెవరో..

‘దృశ్యం’ రెండు సిరీస్‌లు మంచి సక్సెస్ సాధించడంతో దానిని ఫ్రాంచైజీగా తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘దృశ్యం 3’ కోసం సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తైంది. ఈ క్రమంలోనే ‘గతం ఎప్పటికీ నిశ్శబ్దంగా ఉండదు.. ద‌ృశ్యం 3’ రాబోతోంది’ అని మేకర్స్ ప్రకటించారు. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ఈ చిత్రం రూపొందనుంది. మరోవైపు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ఆసక్తికర ప్రకటన చేశారు. దృశ్యం సిరీస్‌ను జీతూ జోసెఫ్ తెరకెక్కిస్తున్నారు. అయితే జయ్ దేవగణ్ సైతం ‘దృశ్యం 3’ తీస్తున్నట్టు ప్రకటించారు. అయితే అజయ్ తీయబోయే చిత్రం ఆయన సొంత కావడం గమనార్హం.

ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన విషయం ఏంటంటే.. జీతూ, అజయ్‌లలో ముందుగా ఎవరు తమ సినిమాను పట్టాలెక్కిస్తారనేది. ఓనమ్ పండుగ తర్వాత ‘దృశ్యం 3’ షూటింగ్ ప్రారంభం కానుందని మలయాల ఇండస్ట్రీ టాక్. దీనిని నిజం చేస్తూ మేకర్స్ సైతం ఓ వీడియోను విడుదల చేశారు. ఓనమ్ లోపు ప్రి ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని సినిమాను పట్టాలెక్కిస్తారట. మరోవైపు అజయ్ దేవగణ్ సైతం తన ‘దృశ్యం 3’ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయన ఈ ఏడాది అక్టోబర్ 2 నుంచి షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం కూడా లొకేషన్స్ వేటలో ఉన్నట్టు సమాచారం. ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే.. ఎవరు ముందు షూటింగ్ పూర్తి చేస్తారు? ఎవరు సక్సెస్ అవుతారు అనేది. ఇప్పటికైతే అంతా జీతూ జోసెఫ్‌ అనే అంటున్నారు. త్వరగా చిత్రాన్ని పట్టాలెక్కించడంతో పాటు పక్కాగా తన సినిమాను సక్సెస్ చేసుకుంటారని అంటున్నారు. అజయ్ ఏమైనా తక్కువ తిన్నారా? ఆయన కూడా ఫుల్ కాన్ఫిడెన్స్‌తోనే ముందుకు వెళుతున్నారు. ఇక చూడాలి ఏం జరుగుతుందో.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.