పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. చకచకా తన సినిమాలన్నింటినీ పూర్తి చేసే పనిలో పవన్ ఉన్నారు. ఇప్పటికే ‘హరి హర వీరమల్లు’ చిత్రం షూటింగ్ పూర్తైంది. ఇక ఇప్పుడు ‘ఓజీ’ చిత్రాన్ని లైన్లో పెట్టారు. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా రూపొందుతున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ముగింపు దశకు చేరుకుంది. మిగిలిన ఆ కాస్త షూటింగ్ను పూర్తి చేసే పనిలో పడ్డారు.
ఈ సినిమా షూటింగ్ ప్రారంభించుకున్నట్టు మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే సెట్లో ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన మేకర్స్.. ‘‘మళ్లీ మొదలైంది.. ఈసారి ముగిద్దాం’’ అంటూ ఓ పోస్ట్ పెట్టారు. ఈ షెడ్యూల్కి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్లోనూ.. తదుపరి షెడ్యూల్స్ విజయవాడ, ముంబైల్లో జరగవచ్చని తెలుస్తోంది. షూటింగ్లో పవన్ ఈ నెల 14న కానీ 15న కానీ అడుగు పెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతోంది. పవన్ పాత్ర ఇతర సినిమాలతో పోలిస్తే మరింత పవర్ఫుల్గా ఉంటుందని తెలుస్తోంది.
ప్రజావాణి చీదిరాల