...

Srivishnu: మా ఇద్దరిలో ఎవరు లేకున్నా సినిమా లేదు

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సింగిల్‌’తో హీరో శ్రీవిష్ణు అలరించబోతున్నారు. ఈ చిత్రంలో కేతిక శర్మ, ఇవానా కథానాయికలుగా నటించారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా మే 9న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘‘కొత్త కథ, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఇంటర్వెల్ క్లైమాక్స్ కొత్తగా ఉంటాయి.

సన్నివేశాలన్నీ మనం రిలేట్ చేసుకునేలా ఉంటాయి. ఈ సినిమా యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. గీతా ఆర్ట్స్‌లో వర్క్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నా లక్కీగా ఈ సినిమాతో కుదిరింది. సినిమా క్లైమాక్స్ చాలా కొత్తగా అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా వెన్నెల కిషోర్, నా క్యారెక్టర్స్‌ను అంతా ఎంజాయ్ చేస్తారు. మా ఇద్దరిలో ఎవరు లేకున్నా సినిమా లేదు. ఈ విషయం సినిమా చూశాక మీకు కూడా తెలుస్తుంది. సినిమాని కంప్లీట్‌గా హైదరాబాద్‌‌లో తీశాం. హైదరాబాద్‌ని చాలా కొత్తగా చూపించాం. ఈ మధ్యకాలంలో హైదరాబాద్‌ని ఇంత కొత్తగా ఎవరు చూపించలేదు. ముఖ్యంగా సినిమాలో నా డైలాగ్ డిక్షన్‌ని యంగ్‌స్టర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ల కోసం కేర్ తీసుకుని మరీ ఈ సినిమా చేశాను’’ అని శ్రీ విష్ణు తెలిపారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.