ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 54 మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఆదివారం రాత్రి జరిగింది. టాస్ గెలిచిన లక్నో జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్ ఓపెనర్ ప్రియాన్స్ ఆర్యను ఒక్క పరుగుకే పెవిలియన్కు పంపి మంచి దూకుడు తో బౌలింగ్ ప్రారంభించింది లక్నో టీమ్. 2 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్ డీలా పడుతుందేమో అనుకుంటే మరో ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ 48 బంతుల్లో 6 ఫోర్లు 7 సిక్సర్లతో 91 పరుగులు చేసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. సిమ్రాన్ సింగ్ జోష్ ఇంగ్లిస్ తోనూ (14 బంతుల్లో ఒక ఫోర్ నాలుగు సిక్సర్లు బాదడంతో ), శ్రేయాస్ అయ్యర్ తోనూ 25 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 45 పరుగులు భారీ భాగస్వామ్యాలు నమోదు చేశాడు. 15 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్సర్తో 33 పరుగులు, స్టొయినిస్ 5 బంతుల్లో 1 ఫోర్ 1 సిక్సర్ సాయంతో 15 పరుగులు చివరి ఓవర్లలో చక చకా పరుగులు చేయటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
నిర్ణీత ఓవర్లలో స్కోరు 5 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. తర్వాత క్రీజులోకి వచ్చిన లక్నో ఓపెనర్స్ మిచెల్ మార్ష్, అడెన్ మార్క్ రామ్ రెండు వికెట్లు 16 పరుగుల వద్ద స్కోర్ ఉండగానే పెవిలియన్ చేరడంతో లక్నో సూపర్ జెయింట్స్కు ఆది నుంచి కష్టాలు తప్పలేదు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన నికోలస్ పూరన్ 6 పరుగులు రిషబ్ పంత్ 18 పరుగులు చేసి అవుటయ్యారు. ఆయుష్ బాదానీ ఒక్కడే వికెట్ వద్ద పాతుకు పోయాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు 5 సిక్సర్లతో 74 పరుగులు చేసి పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. అబ్దుల్ సమద్ 24 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సర్లతో 45 పరుగులు చేసి బాదానీ కి సహకారం అందించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఫైనల్ గా 37 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ చేతిలో లక్నో ఓడిపోయింది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ అర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.
శివ మల్లాల