సూర్య హీరోగా నటించిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్లో ట్రైబల్స్ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. దీనిపై తాజాగా విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు. పహల్గాం దాడి ఘటనపై విజయ్ స్పందిస్తూ.. ఈ దాడులు వందల సంవత్సరాల క్రితం గిరిజన వర్గాల మధ్య జరిగిన ఘర్షణలను పోలి ఉన్నాయన్నారు. 500 సంవత్సరాల క్రితం గిరిజనులు కొట్టుకున్నట్లు.. ఉగ్రవాదులు సైతం కామన్ సెన్స్ లేకుండా పనులు చేస్తున్నారని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. దీనిపై గిరిజన సంఘాలు మండిపడ్డాయి. తమకు క్షమాపణ చెప్పాల్సిందేనని భీష్మించాయి. ఓ న్యాయవాది.. విజయ్ దేవరకొండపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన విజయ్ దేవరకొండ.. కొందరు ఈ మాటను కొందరు అపార్థం చేసుకుని హర్ట్ అయ్యారన్నారు.
ట్రైబ్ అని తను వాడిన పదం వెనక ఉద్దేశం భూమ్మీద తొలినాళ్లలో మనమంతా తెగలుగా, జాతులుగా ఉన్నామని చెప్పడమేనని.. అందులో షెడ్యూల్ ట్రైబ్స్ గురించి కాదని విజయ్ వివరణ ఇచ్చారు. ‘‘రెట్రో ఈవెంట్ లో నేను మాట్లాడిన మాటలు కొందరిని ఇబ్బంది పెట్టాయనే విషయం నా దృష్టికి వచ్చింది. ఎవరినీ బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. పైగా.. షెడ్యూల్ ట్రైబ్స్ అంటే నాకు ఎంతో గౌరవం, ప్రేమ. నేను మన సమాజంలో ఐక్యత ఉండాలి, ఒక్కటిగా మనమంతా ముందుకెళ్లాలనే చెప్పాను. దేశమంతా ఒక్కటిగా నిలబడాలని మాట్లాడాను. మానవ జాతి తొలినాళ్లలో మన ట్రైబ్స్, క్లాన్స్ గా ఉండేవాళ్లం. ఆ ఉద్దేశంతో ట్రైబ్ అనే మాట వాడాను. ఈ మాటకు ఎవరైనా హర్ట్ అయితే చింతిస్తున్నాను. శాంతి, పురోభివృద్ధి, ఐక్యత కోసం నా సినిమా మీడియంను ఉపయోగిస్తాను’’ అన్నారు.
ప్రజావాణి చీదిరాల