విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటకు ఆన్స్క్రీనే కాదు.. ఆఫ్స్క్రీన్ కూడా ఫ్యాన్స్ ఇష్టపడతారు. వీరిద్దరూ గతంలో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రెడ్’ చిత్రాల్లో కలిసి నటించారు. అప్పటి నుంచి కూడా వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి వీరిద్దరూ కూడా కొంత ఆజ్యం పోశారు. కలిసి ఎయిర్పోర్టులో కనిపించడం.. వీరిద్దరికీ సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు రావడం వంటివి జరిగాయి. దీంతో ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ ఇద్దరూ కలిసి నటిస్తే చూడాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆ తరుణం త్వరలోనే రానుందని సమాచారం. దీనికి కారణం మైత్రీ మూవీస్ పెట్టిన పోస్టుకు రష్మిక రిప్లై ఇవ్వడమే.
అసలు మైత్రీ మూవీ మేకర్స్ ఏం పోస్ట్ పెట్టింది? దానికి రష్మిక ఏం రిప్లై ఇచ్చింది అంటారా? ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ చిత్రంతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో చేస్తూనే మరోవైపు రాహుల్ సంకృత్యాన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. పిరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందనున్న ఈ చిత్రం వచ్చే నెలలో హైదరాబాద్లో షూటింగ్ ప్రారంభించుకోనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకు జోడిగా రష్మిక నటించనుందని సమాచారం. దీనిపై ‘వేచి చూద్దాం’ అని అర్థం వచ్చేలా మైత్రీ మూవీ మేకర్స్ నెట్టింట పోస్ట్ పెట్టి రష్మికను ట్యాగ్ చేసింది. దీనికి ఆమె ఓకే అని రిప్లై ఇచ్చింది. దీంతో విజయ్ దేవరకొండ, రష్మిక జోడి ఫిక్స్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ముచ్చటగా మూడోసారి ఈ జంటను వెండితెరపై చూసేందుకు అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.