ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన సీజన్ 18 ఐపీఎల్ 50 మ్యాచ్ జైపూర్ లో జరిగింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఓపెనర్స్ రోహిత్ శర్మ 36 బంతుల్లో 53 పరుగులు ( 9 ఫోర్లు) , రికెల్టన్ 38 బంతుల్లో 61 పరుగులు ( 7 ఫోర్లు 3 సిక్సర్లు) రెచ్చిపోయి బ్యాటింగ్ చేయటంతో ముంబై ఇండియన్స్ జట్టు వికెట్ నష్టపోకుండా 100 పరుగుల మైలు రాయిని 10.1 ఓవర్లలో చేరుకుంది. తొలి వికెట్ 116 పరుగుల వద్ద ముంబై కోల్పోయింది. 12.4 ఓవర్లలో 123 పరుగుల వద్ద రెండో వికెట్ రోహిత్ రూపంలో కోల్పోయింది . తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ 23 బంతుల్లో 48 పరుగులు ( 4 ఫోర్లు 3 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో 48 పరుగులు ( 6 ఫోర్లు 1 సిక్సర్) చేసిన ఇద్దరు బ్యాటర్లు నాట్ అవుట్ నిలవటంతో స్కోరు నిర్ణీత ఓవర్లలో 217 పరుగులు అయ్యింది. రాజస్థాని బౌలర్లు ఎవరు ముంబై టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ నిలువరించలేకపోయారు.
తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన రాజస్థాన్ సంచలన ఓపెనర్ వైభవ్ ఈ మ్యాచ్ లో ఖాతా తెరవలేదు. 4.5 ఓవర్లలో పవర్ ప్లేలోనే రాజస్థాన్ టాప్ ఆర్డర్ 5 వికెట్లు కోల్పోయి 50 పరుగులు మాత్రమే చేసి పీకల్లోతూ కష్టాల్లో పడింది. జైస్వాల్ 6 బంతుల్లో 13 పరుగులు ( 2 సిక్సర్స్) నితీష్ రాణా 11 బంతుల్లో 9 పరుగులు రియాన్ పరాగ్ 8 బంతుల్లో 16 పరుగులు (3 ఫోర్స్) ధ్రువ్ జురెల్ 5 బంతుల్లో 2 పరుగులు హెట్మెయర్ పరుగులేమీ చేయకుండానే వెనుదిరగటంతో రాజస్థాన్ టీమ్ సపోర్టర్స్ షాక్ కు గురయ్యారు. 8 వ ఓవర్ తన స్పెల్ ను స్టార్ట్ చేసిన హార్దిక్ వేసిన తొలి బంతికి శుభం దుబే వికెట్ తీసి తన ఆల్రౌండర్ ప్రతిభను చాటుకున్నాడు. చివర్లో 27 బంతుల్లో 30 పరుగులు (2 ఫోర్లు 2 సిక్సర్లతో) కాసేపు క్రీజులో నిలిచాడు. ఎంఐ బౌలర్స్ బౌల్ట్, కర్ణ్ శర్మ చెరో మూడు వికెట్లు తీసి ముంబై ఇండియన్స్ కు 100 పరుగుల భారీ విజయాన్ని అందించారు. మరో 23 బంతులు మిగిలి ఉండగానే ముంబై విజయం అందుకుంది. ఈ విజయంతో ముంబై పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది.
Also Read This : చెన్నై అకౌంట్లో మరో ఓటమి. 6 వికెట్స్ తేడాతో పంజాబ్ విజయం.
