భారత్ అంటే లౌకిక దేశం. ఎన్నో కులాలు, మతాలున్నా భారతీయులంతా ఒక్కటే. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఇది లౌకిక దేశమేనా? అనిపిస్తుంది. ఇటీవల కశ్మీర్లోని పహల్గాంలో మతం అడిగి మరీ 26 మందిని ఉగ్రవాదులు చంపేశారు. సరదాగా కుటుంబంతో కలిసి సమ్మర్ వెకేషన్ను ఎంజాయ్ చేసేందుకు వెళ్లిన వారిపై తూటా పేలింది. దీనిని కుల, మతాలకు అతీతంగా ఖండించాల్సిందే. కానీ కొందరు మాత్రం పాక్కు అనుకూలంగా మాట్లాడటం ఆందోళన కలిగిస్తోంది. వారికి నేడు ఏపీ ఉప ముఖ్యమంత్రం పవన్ కల్యాణ్ గట్టిగానే సమాధానం చెప్పారు. పాక్కు అనుకూలంగా మాట్లాడాలనుకుంటే ఆ దేశానికే వెళ్లిపోవాలని పవన్ అన్నారు. మత ప్రాతిపదికన మనుషుల్ని చంపడం సరికాదన్నారు. కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరి సి.కె.కన్వెన్షన్లో హాలులో నివాళుల కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ.. ఉగ్రవాదం, హింసపై అంతా ఒకేలా స్పందించాలని.. భారత్లో కశ్మీర్ కూడా భాగమేనన్నారు. ఓట్లు, సీట్ల కోసం ఇలాంటి విషయాలపై మాట్లాడటం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా కావలికి చెందిన మధుసూదన్రావు కుటుంబం కశ్మీర్ ఘటనలో పెద్ద సపోర్ట్ను కోల్పోయింది. కాబట్టి వారి కుటుంబానికి పార్టీ తరుఫున పవన్ రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ ఘటనలో జనసేన ఓ కార్యకర్తను కోల్పోయిందన్నారు. సత్యం మాట్లాడాలంటే ధైర్యం కావాలని.. అసలు చనిపోయిన మధుసూదన్రావు ఎవరికి హాని చేశారని ప్రశ్నించారు. కుటుంబాన్ని తీసుకొని కశ్మీర్కు వెళ్తే చంపేశారని.. కశ్మీర్ మనది కాబట్టే అక్కడికి వెళ్లామని మధు భార్య చెప్పారు. హిందువులకు ఉన్న దేశం ఇదొక్కటేనని.. ఇక్కడ కూడా ఉండొద్దంటే ఎక్కడికి పోవాలని పవన్ ఫైర్ అయ్యారు. యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలని.. మత కలహాలు సృష్టించే వారిని అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలని పవన్ కల్యాణ్ అన్నారు.