Vaibhav Suryavamshi :
జైపూర్ లో జరిగిన ఐపీఎల్ 2025 18 వ సీజన్ 47 వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు ఓపెనింగ్ బ్యాట్స్మన్ వైభవ్ సూర్యవంశీ తన సంచలన ఇన్నింగ్స్తో 35 బంతుల్లో 100 పరుగులు చేసి ( 7 ఫోర్స్ 11 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ గెలుపుతో రాజస్థాన్ జట్టు 8 వ ప్లేసుకి చేరింది. 8th ప్లేస్లో ఉన్న ఎస్ ఆర్ హెచ్ జట్టు 9 త్ ప్లేస్ కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసి చాలా పటిష్టమైన స్థితిలో నిలిచింది. టైటాన్స్ బ్యాటర్స్ సాయి సుదర్శన్ 30 బంతుల్లో 39 పరుగులు ( 4 ఫోర్లు 1 సిక్సర్) , కెప్టెన్ శుభ్ మన్ గిల్ 50 బంతుల్లో 84 పరుగులు ( 5 ఫోర్లు 4 సిక్సర్లు) జోష్ బట్లర్ 26 బంతుల్లో 50 పరుగులు (3 ఫోర్స్ 4 సిక్సర్లు) ముగ్గురు బ్యాటర్లు కీలక ఇన్నింగ్స్ ఆడటంతో స్కోర్ 200 పరుగులు అలవోకగా దాటేసింది.
తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన రాజస్థాన్ జట్టు ఓపెనర్స్ వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ లు తొలి వికెట్ కు ఏకంగా 11.5 ఓవర్లలో 166 పరుగులు జోడించారు. అప్పటికే రాజస్థాన్ విజయం ఖరారయ్యింది. తర్వాత జైస్వాల్ 40 బంతుల్లో 70 పరుగులు ( 9 ఫోర్లు 2 సిక్సర్లు) తో కలిసి ఇన్నింగ్స్ కి కావాల్సిన పరుగులను రియాన్ పరాగ్ 15 బంతుల్లో 32 పరుగులు ( 2 ఫోర్లు 2 సిక్సర్లు) చేసి ఇద్దరు నాట్ అవుట్ గా నిలిచారు. రాజస్థాన్ ఇన్నింగ్స్ మరో నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. వైభవ్ ఇన్నింగ్స్లో 7 ఫోర్స్ 11 సిక్సర్లు ఉన్నాయి. అంటే బౌండరీల రూపంలో వైభవ్క్ వచ్చిన స్కోర్ 94 పరుగులు. 2013లో క్రిస్ గేల్ కొట్టిన 30 బంతుల్లో కొట్టిన 100 పరుగులు మాత్రమే వైభవ్ కంటే ముందున్నాడు. అతి తక్కువ బంతుల్లో వేగంగా సెంచరీ చేసిన భారతీయ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ మాత్రమే. ఈ మ్యాచ్ వైభవ్ కెరీర్ను మలుపు తిప్పిన మ్యాచ్ గా ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది.
శివ మల్లాల