WAVES : ఒకే ఈవెంట్‌లో సందడి చేయనున్న చిరు, అల్లు అర్జున్

ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌ ఒక ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు వేదిక కానుంది. ఈ ఏడాది 1 మే 2025 నుంచి వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌ అత్యంత వైభవంగా జరుగనుంది. ఈ కార్యక్రమం నాలుగు రోజుల పాటు అంటే మే 4 వరకూ జరుగనుంది. ఈ కార్యక్రమానికి దేశంలోని అన్ని ఇండస్ట్రీల నుంచి పాపులర్ స్టార్స్ హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ సైతం ఇప్పటికే పూర్తైందని సమాచారం. నార్త్ నుంచి అమితాబ్ బచ్చన్, హేమామాలిని, మిథున్ చక్రవర్తి, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ తదితరులు పాల్గొననున్నారు. ఇక సౌత్ నుంచి ఒక ఆసక్తికర ఘటన జరుగబోతోంది. చాలా కాలం తర్వాత ఒకే వేదికను చిరంజీవి, అల్లు అర్జున్ ఇద్దరూ ఈ ఈవెంట్‌లో పాల్గొననున్నట్టు సమాచారం. మొత్తానికి ఈ వేడుక మెగా, అల్లు ఫ్యాన్స్‌కు పండుగ లాంటిది.

ఇక ఈ వేవ్స్ తొలి ఎడిషన్‌లో చిరు, బన్నీలతో పాటు రాజమౌళి, నాగార్జున్, విజయ్ దేవరకొండ, రజినీకాంత్, మోహన్‌లాల్ తదితరులు హాజరుకానున్నట్టు సమాచారం. మే 1న ప్రారంభం కాబోయే ఈ సదస్సు ‘ది స్టోరీస్ దట్ షేప్డ్ ఇండియాస్ సోల్’ ప్యానెల్‌తో సమ్మిట్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. దీనికి అక్షయ్ కుమార్ హోస్టింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, హేమ మాలిని, మిథున్ చక్రవర్తి, రజనీకాంత్, మోహన్ లాల్ త‌దిత‌రులు దీనిలో పాల్గొననుండటంతో ఇది అత్యంత భారీ ప్యానెల్‌గా మారింది. కరణ్ జోహార్ హోస్టింగ్‌లో జరుగనున్న.. ‘ది న్యూ మెయిన్ స్ట్రీమ్: బ్రేకింగ్ బోర్డర్స్, బిల్డింగ్ లెజెండ్స్’ సెషన్‌లో ఎస్ ఎస్ రాజమౌళి, ఏఆర్ రెహమాన్, అనిల్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ హాజరవుతారు. అల్లు అర్జున్ హోస్టింగ్‌లో ‘ఇండియాస్ క్రియేటివ్ అసెంట్: ఎం మ‌రియు ఇ లీడర్స్ ఆన్ బికమింగ్ ఎ గ్లోబల్ పవర్‌హౌస్’ ప్యానెల్‌లో పాల్గొనే వారి విషయంలో క్లారిటీ అయితే రాలేదు.

Also Read This : అల్లు అర్జున్ సరసన ముచ్చటగా ముగ్గురు ముద్దుగుమ్మలు..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *