అల్లు అర్జున్ సరసన ముచ్చటగా ముగ్గురు ముద్దుగుమ్మలు..

‘పుష్ప 2’ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని అట్లీతో సినిమాను అయితే ఒక స్ట్రాటజిక్ వేలో అల్లు అర్జున్ ప్రకటించాడు. తన పుట్టిన రోజు సందర్భంగా ఒక మెస్మరైజింగ్ వీడియోతో అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు. సినిమా కనీసం లాంఛనంగా కూడా ప్రారంభం కాకముందే ఒక హైప్ అయితే క్రియేట్ చేశాడు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు అయితే చేసుకుంటున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను కళానిధి మారన్ నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు కనిపించనున్నారట. అయితే ఒక హీరోయిన్ సమంత అంటూ ఇటీవల వార్తలొచ్చాయి. దీనిలోనూ క్లారిటీ అయితే లేదు.

ఇప్పుడు మరో హీరోయిన్ గురించి ప్రచారం జరుగుతోంది. ఆమె మరెవరో కాదు.. మృణాల్ ఠాకూర్. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మతో మేకర్స్ చర్చలు కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అమ్మడు ఓకే చెప్పడం.. ఆ వెంటనే లుక్ టెస్ట్ కూడా నిర్వహించడం చకచకా జరిగిపోయిందని అంటున్నారు. ముచ్చటగా మూడో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ పేరు వినిపిస్తోంది. అమ్మడితో చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. అది ఎంతవరకు నిజమనేది మాత్రం తెలియరాలేదు. మొత్తానికి ముగ్గురు ముద్దుగుమ్మల విషయమై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే దీపిక పదుకొణె పేరు కూడా పరిశీలనలో ఉందని సమాచారం. మొత్తానికి అల్లు అర్జున్ సరసన నటించబోయే ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలియాల్సి ఉంది. ఇక విజువల్ ఎఫెక్ట్స్‌తో ఒక అద్భుతాన్ని అయితే అల్లు అర్జున్, అట్లీ కాంబో వెండితెరపై ఆవిష్కరించనుందని తెలుస్తోంది. పునర్జన్మ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కనుందంటూ ప్రచారం జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *