Pahalgam Attack : పాపాల లెక్క త్వరలోనే తేలాలి…

Pahalgam Attack :

కొన్నిగాయాలు కాలంతోపాటు మానిపోతాయి. కొన్ని ఎప్పటికీ మానవు. ఆ గాయాలు గుండెల్లో మంటలై మండుతూనే ఉంటాయి. పెహల్గామ్‌ ఉగ్రదాడి జరిగింది 28 మందిపై కాదు… 140 కోట్ల మంది భారతీయుల హృదయాలపై. మంగళవారం జరిగిన ముష్కరుల దాడి తాలూకు గాయం అలాంటిదే. అదెన్నటికి మానదు. ఆడుతూ పాడుతూ తిరుగుతూ ప్రకృతిని ఎంజాయ్‌ చేస్తూ గడుపుతున్న వారి జీవితాలు మరో కొన్ని నిమిషాల్లో ముగుస్తాయని కానీ.. అవే తమకు చివరి క్షణాలని కానీ ఏ ఒక్కరికి తెలియదు. బాధిత కుటుంబాల్లోనే కాకుండా భారత కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపిందా దుశ్చర్య. ప్రమాదాల బారిన పడి చనిపోతే అయ్యోపాపం ఏ తల్లి కన్న బిడ్డో ఇక్కడ ప్రాణం పోయింది అంటూనే ఎంతో నిట్టూరుస్తాం. కానీ, ఇలాంటి దుర్మార్గపు చర్యలు జరిగినప్పుడు మాత్రం మనలో మనమే కుంగిపోతాం. నరరూప రాక్షసులంతా భూమ్మీద మనమధ్యలోనే తిరుగుతున్నారని తెలిసి కూడా ఏమీ చేయలేని నిస్సహాయులం. వారికి మానవత్వం అనేది ఏ కోశానా ఎందుకు లేదో? వాళ్లు ఒక అమ్మకు అయ్యకు ఎందుకు పుట్టలేదా? పుడితే అలా ఎలా పుట్టారు? ఇలా ఎలా పెరిగారు? వీరిని మనమేం చేయలేమా? మనలో మానవత్వపు ఛాయలు ఇంకా ఉన్నాయా? లేవా? అసలు ఏ దేవుడు వీరిని శిక్షించాలి? ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలన్నీ మన మదిని తొలిచేస్తున్న తరుణమిది. కానీ ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పేదెవరు? రెండు రోజుల తర్వాత అంతా సాధరణమై పోతుంది. రోడ్డుపై రక్తపు మరకలు కనిపించవు. మన మదిని తొలిచేస్తున్న ఏ ప్రశ్న మన బిజీ లైఫ్‌లో గుర్తుకు రాదు. కానీ పాపాల లెక్క మాత్రం త్వరలోనే తేలాలని కోరుకుంటూ నా రక్తం మరిగిపోయి చేస్తున్న వీడియో ఇది..

శివమల్లాల

Also Read This : ఆకాశంపై ఉమ్మి వేస్తే ఎక్కడ పడుతుంది… తప్పెవరిది

Terror Attack
Terror Attack

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *