హీరో విష్ణు మంచు (Vishnu Manchu( డ్రీమ్ ప్రాజెక్టుగా కన్నప్ప (Kannappa) సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు (Mohan Babu) నిర్మించారు. ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. చాలా రోజులుగా సినిమాలో నటించిన ముఖ్య పాత్రదారుల లుక్కు సంబంధించిన పోస్టర్స్ విడుదల చేస్తూ సినిమాపై మేకర్స్ అంచనాలను పెంచేశారు. తాజాగా కన్నప్ప టీం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath)ను మర్యాదపూర్వకంగా కలిసింది. మోహన్ బాబు, విష్ణు, ప్రభుదేవా తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. యోగికి ప్రముఖ చిత్రకారుడు రమేష్ గొరిజాల గీసిన చిత్రపటాన్ని మోహన్ బాబు బహూకరించారు. అనంతరం ‘కన్నప్ప’ రిలీజ్ డేట్ పోస్టర్ను యూపీ సీఎం ఆదిత్య నాథ్ రిలీజ్ చేసి అభినందించారు. ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి భారీ తారాగణం నటించింది.
ప్రజావాణి చీదిరాల
Also Read This : దర్శనమే.. మధుర క్షణమే..
