Chandrababu Naidu : కొత్తింటి నిర్మాణానికి శంకుస్థాపన

Chandrababu Naidu :

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని అమరావతిలో కొత్త ఇంటిని నిర్మించబోతున్నారు. దీనికి బుధవారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. అమరావతిలోని వెల‌గ‌పూడి సచివాలయం వెనుక.. ఈ9 రహదారి పక్కనే చంద్రబాబు తన సొంతింటి నిర్మాణం చేపట్టారు. కుటుంబ సమేతంగా చంద్రబాబు కొత్త ఇంటి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. శంకుస్థాపన పూజా కార్యక్రమం చంద్రబాబు దంపతులతో పాటు మనవడు దేవాన్ష్ చేతుల మీదుగా జరిగింది. ఈ ఇంటి నిర్మాణం కోసం గత ఏడాది డిసెంబరులో చంద్రబాబు స్థలాన్ని కొనుగోలు చేశారు. వెలగపూడి గ్రామానికి చెందిన ఓ రైతు నుంచి ఈ స్థలాన్ని విక్రయించారు. ఈ ఐదు ఎకరాలకు సంబంధించి ఇటీవలే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తైంది. అయితే ఇంటి నిర్మాణం మాత్రం 1,455 చదరపు గజాల విస్తీర్ణంలో అంటే జి ప్లస్‌ 1 ఇంటి నిర్మాణం జరుగనుంది. ఏడాది లోపు ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్‌, బ్రాహ్మణి, దేవాన్ష్ పాల్గొన్నారు.

ప్రజావాణి చీదిరాల

Also Read This : విద్యార్థులకు రేవంత్ ప్రభుత్వం గుడ్ న్యూస్..

Rajendraprasad Interview
Rajendraprasad Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *