Telangana :
విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో కొత్త టెక్నాలజీ శక్తిని విద్యార్థులకు అందించనున్నట్టు వెల్లడించింది. ఈ క్రమంలోనే రెండు లక్షల మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఉద్యోగాలు, అవకాశాలతో పాటు భవిష్యత్కు బలమైన అడుగు దీంతో పడనుంది. యువతకు నైపుణ్యం అందించడమే లక్ష్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో శిక్షణ ఇప్పించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అలాగే హైదరాబాద్ను గ్లోబల్ టెక్ హబ్గా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయనున్నారు. ప్రపంచ స్థాయి భాగస్వామ్యాలతో రాష్ట్రానికి కొత్త అవకాశాలు తీసుకురానున్నారు.
ప్రజావాణి చీదిరాల
Also Read This : ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్