NTR : ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్

NTR  :

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌ సింగపూర్‌లోని స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మార్క్ శంకర్‌కు ప్రస్తుతం సింగపూర్‌లో చికిత్స కొనసాగుతోంది. మార్క్ కోలుకోవాలని సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ‘‘సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ చిక్కుకున్నాడని తెలిసి బాధపడ్డాను. అతను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్’’ అని ఎన్టీఆర్ ట్వీట్ పెట్టారు.

కాగా.. సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. మార్క్ శంకర్‌తో పాటు గాయపడిన ఇతర చిన్నారులు పాఠశాల యాజమాన్యం హుటాహుటిన ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం మార్క్ శంకర్ కోలుకుంటున్నట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్, చిరంజీవి దంపతులు సింగపూర్ వెళ్లారు.

ప్రజావాణి చీదిరాల

Also Read This : ‘భైరవం’కు భయపడే విష్ణు ‘కన్నప్ప’ను వాయిదా వేశాడా?

Pawan Kalyan son fire accident
Pawan Kalyan son fire accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *