మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ వంటి అంశాల కలబోతగా రూపొందిన చిత్రం ‘ఎర్రచీర – ది బిగినింగ్’. బేబీ డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం వేసవి కానుకగా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తుండగా, దర్శకుడు సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా గురించి నిర్మాతలలో ఒకరైన ఎన్వీవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో క్లైమాక్స్ ఎపిసోడ్, అనేకమంది అఘోరాలతో శివుడిని అత్యద్భుతంగా చూపిస్తూ షూట్ చేశాం. సీక్వెన్స్ అద్భుతంగా వచ్చింది. కుటుంబం అంతా పిల్లలతో సహా చూసి ఆనందించదగ్గ సినిమా’’ అని అన్నారు. దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ.. ‘‘ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలకు మంచి స్పందన వచ్చింది ముఖ్యంగా ‘తొలి తొలి ముద్దు’ సాంగ్ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది అలాగే టీజర్, ట్రైలర్కి మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుందని నమ్ముతున్నాం” అని అన్నారు.
ప్రజావాణి చీదిరాల
Also Read This:‘దేవర2’ స్టోరీ ఏంటో చెప్పేసిన ఎన్టీఆర్