విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ “సంక్రాంతికి వస్తున్నాం” ప్రేక్షకులను విశేషంగా అలరించింది.
ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరీ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదలై ఘనవిజయం సాధించింది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి కొత్త రికార్డు సృష్టించింది.
మూవీ టీమ్ ఇప్పటికే ఈ చిత్రం ఓటీటీలో విడుదలకు ముందుగా టెలివిజన్ ప్రీమియర్ చేయనున్నట్లు ప్రకటించింది.
తాజాగా, మార్చి 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుందని అధికారికంగా వెల్లడించారు.
జీ5/జీ తెలుగు భారీ ధరకు ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నాయి.
ఈ సందర్భంగా చిత్రబృందం, “మళ్లీ సంక్రాంతి వైబ్స్ను ఆస్వాదించండి” అంటూ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా సందేశాన్ని పంపింది.
సంజు పిల్లలమర్రి