PV Sindhu Wedding :
రెండు సార్లు ఒలింపిక్ పతకాన్ని ఇండియాకి సాధించి పెట్టిన ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సినిమా తారల స్థాయిలో సెలబ్రిటీ హోదాను కలిగి ఉంటుంది అనే విషయం తెల్సిందే.
ఆమెకు సంబంధించిన ఏ విషయం అయినా జనాల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది.
ఆటకు గ్లామర్ను అద్దడంతో పాటు, కమర్షియల్ ఎలిమెంట్స్ను సైతం అద్దడం ద్వారా పీవీ సింధు తెలుగు రాష్ట్రాల్లో చాలా పాపులారిటీని సొంతం చేసుకుంది.
ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి పీవీ సింధు వార్తల్లోనే ఉంటారు. ఇప్పుడు మరోసారి సింధు వార్తల్లో నిలిచారు.
భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.
పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో సింధు వివాహాం ఆదివారం ఘనంగా జరిగింది.
రాజస్థాన్, ఉదయ్పూర్లోని ఓ దీవిలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య రాత్రి 11.20 గంటలకు మూడు ముళ్ల బంధంతో సాయి-సింధు ఒక్కటయ్యారు.
ఉదయ్ సాగర్ సరస్సులో ఉన్న రఫల్స్ హోటల్ ఈ వేడుకకు వేదికగా నిలిచింది.
తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా పూర్తి శాస్త్రబద్ధంగా ఈ పెళ్లిని నిర్వహించారు.
కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిపి మొత్తం 140 మంది ముఖ్యుల సమక్షంలో ఈ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ పెళ్లిలో తెలుగుదనంతో పాటు రాజస్థాన్ రాచరిక సంస్కృతి ఉట్టిపడేలా ఏర్పాట్లు చేశారు.
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు చాముండేశ్వర్నాథ్, వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్తో పాటు ప్రముఖ వైద్యుడు గురువారెడ్డి తదితరులు ఈ వివాహానికి హాజరయ్యారు.
మంగళవారం రాత్రి హైదరాబాద్లో వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్కు సినీ, రాజకీ, క్రీడా ప్రముఖులు హాజరవ్వనున్నారు.
ఆరావళి పర్వతాల మధ్య ఉదయ్సాగర్ సరస్సులో 21 ఎకరాల్లో ఈ దీవి విస్తరించి ఉండగా.. రఫల్స్ సంస్థ రాజభవనాలను తలపించే రిసార్ట్ను నిర్మించింది.
ఈ రిసార్ట్లో 100 గదులతో మూడు ప్రధాన భవంతులు ఉన్నాయి.
ఈ రిసార్ట్లో సాధారణ గదికి ఒక్క రోజు రెంట్ సుమారు లక్ష రూపాయలు.
సింధు పెళ్లి నిమిత్తం అతిథుల కోసం ఈ 100 గదులను బుక్ చేశారు. ఈ పెళ్లికి వచ్చిన వారికి సింధు కుటుంబం విమాన టికెట్లు కూడా బుక్ చేసింది.
సంజు పిల్లలమర్రి
Also Read This : అల్లు అర్జున్ ఇష్యూ మీద కామెంట్స్ చేసిన విజయశాంతి
