Manchu Vishnu :
టాలీవుడ్ నటుడు మోహన్ బాబు ఇంట్లో వివాదాలు తార స్థాయికి చేరాయి.
ఆస్తి విషయం తగాదాల్లో భాగంగా నిన్న మధ్యాహ్నం మోహన్ బాబు ఇంట్లో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దారితీసింది.
మోహన్ బాబు, మనోజ్ పై డాడీకి పాల్పడ్డారని పోలీస్ స్టేషన్ లో ఒకరి పైన ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.
ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం భార్యతో కలసి నడవలేని స్థితిలో మంచు మనోజ్ బంజారాహిల్స్ లోని టీఎక్స్ అసుపత్రిలో చేరారు.
ఆ సందర్భంగా ఆయనకు వైద్యులు ఎమర్జెన్సీ వార్డులో చికిత్సను అందజేశారు.
అనంతరం ఆయన ఆసుపత్రి నంచి డిశ్చార్జ్ అయి నేరుగా జల్ప లోని తన ఇంటికి వెళ్లిపోయారు.
అయితే, తాజాగా మనోజ్ ఇంటికి మంచు విష్ణు బిజినెస్ పార్టనర్ విజయ్ వెళ్లినట్లుగా తెలుస్తోంది.. అక్కడున్న సీసీ ఫుటేజ్కు సంబంధించి హార్డ్స్క్ ను విజయ్ తన వెంట తీసుకెళ్లాడని సమాచారం.
అదేవిధంగా మంచు మనోజ్ ఇంటి చుట్టూ విష్ణు మనుషులు రెక్కీ వేశారు. మరోవైపు మనోజ్ తన ఇంటి వద్ద ప్రైవేటు బౌన్సర్లతో కాపలా పెట్టుకున్నారు.
ప్రస్తుతం దుబాయ్ నుంచి వచ్చిన మంచు విష్ణు మరికొద్దినేపట్లోనే మనోజ్ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది.
Also read this : ఆస్థి పంపకాల్లో మనోజ్ పై మోహన్ బాబు దాడి
