ఈ సినిమాకి “జీబ్రా” అని టైటిల్ పెట్టడానికి ముఖ్య కారణం

టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ ప్రస్తుతం “జీబ్రా” అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో కన్నడ ప్రముఖ హీరో ధనుంజయ్, సత్యరాజ్, సునీల్, కమెడియన్ సత్య తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

ఈ సినిమాకి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాతలు ఎస్.ఎన్ రెడ్డి – బాల సుందరం, దినేష్ సుందరం తదితరులు కలసి ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు.

డైరెక్టర్ ఈశ్వర్ కార్తీక్ మాట్లాడుతూ : “ఈ సినిమా కి “జీబ్రా” అని టైటిల్ పెట్టడానికి ముఖ్య కారణం జీబ్రా లో తెలుపు నలుపు లైన్స్ ఉంటాయి.

అలాగే మనిషి లో కూడా రెండు కోణాలు ఉంటాయి అందుకే ఈ టైటిల్ పెట్టాను.

సినిమా మొత్తం బ్యాంకు మరియు స్టాక్ మార్కెట్ లో జరిగే స్కాంలు గురించి చెప్తూ ఆ లైన్ అప్ లో తీసుకున్న స్టోరీ ” ఇది..

“ఈ సినిమా గురించి ఎటువంటి భయము లేదు ఇండస్ట్రీలో కొంతమంది నిర్మాతలు అలాగే ప్రముఖులకు ఈ సినిమా చూపించడం జరిగింది.

ఇప్పటి వరకు ఎటువంటి నెగిటివ్ టాక్ లేదు అంత పాజిటివ్ టాక్” అని అన్నారు.

ఇలా వేరు వేరు ఇండస్ట్రీస్ నుండి యాక్టర్స్ ని తీసుకోవడానికి ముఖ్య కారణం మార్కెట్ కోసం తీసుకున్నాను..తరువాత వాళ్ళు ఆయా పాత్రలకు న్యాయం చేసారు.

ఈ విషయం ఇలా ఉండగా జీబ్రా సినిమా నవంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ముందుకు వస్తోంది.

కాగా ట్రైలర్ ని కూడా  మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. మరి ట్రైలర్ తో అలరించిన సత్యదేవ్ థియేటర్లలో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి

Also Read This : కరుంగలి మాల విశిష్టత ఏంటి? ఆ మాలకు ధైవత్వం ఉంటుందా?

Karungali mala
Karungali mala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *