nitrogen hypoxia :
ప్రపంచంలోనే తొలిసారి ఆ శిక్షను ఎదుర్కొన్న అమెరికా ఖైదీ యూజీన్ స్మిత్ ఎలా చనిపోయాడు..
మరణ శిక్ష అంటే అందరికీ గుర్తు వచ్చేది ఉరి.
అమెరికా లాంటి దేశాల్లో అయితే విషపు ఇంజక్షన్ను కూడా మరణ శిక్షకు వాడతారు.
అయితే, మరణ శిక్ష పడిన ఖైదీలు నొప్పి తెలియకుండా చావడం కోసం ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే అమెరికాలోని అలబామాలో ఓ ఖైదీకి ప్రపంచంలోనే నైట్రోజన్ వాయువు ద్వారా మరణశిక్ష విధించారు.
స్వచ్ఛమైన నైట్రోజన్ వాయువును పీల్చేలా చేసి చంపేశారు. దీన్నే నైట్రో హైపోక్సియా అంటారు.
మరణ శిక్ష పడ్డ ఖైదీ పేరు కెన్నెత్ యూజీన్ స్మిత్. 1988నాటి హత్య కేసులో దోషి. అతనికి అలబామా కోర్టు నైట్రో హైపోక్సియాతో మరణ శిక్ష విధించింది. జనవరి 25న యూజీన్ స్మిత్కు నైట్రోజన్ హైపోక్సియాతో మరణశిక్ష అమలు చేశారు.
అయితే, పద్ధతిలో కూడా మరణశిక్షను అనుభవించడం అంత నొప్పిలేనిది ఏమీ కాదని, స్మిత్ తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నాడని శిక్షను పర్యవేక్షించిన వైద్యులు పేర్కొన్నారు.
కొన్ని సెకన్ల పాటు స్మిత్ కాళ్లు, చేతులు కొట్టుకున్నాయని, కళ్లు బయటకు వచ్చాయని, ఊపిరాడక వేదన అనుభవించాడని తెలిపారు. ఈ శిక్షను అమానవీయమైన దండనగా ఐక్యరాజ్య సమితి ఓ ప్రకటనలో అభివర్ణించింది.
నైట్రోజన్ హైపోక్సియా అంటే?
నైట్రోజన్ వాయువు రంగు, రుచి లేనిది. మనం పీల్చే గాలిలో 78శాతం నైట్రోజనే ఉంటుంది. మనం సరైన మోతాదులో ఆక్సిజన్ తో కలిపి నైట్రోజన్ ను పీల్చినప్పుడు ఎలాంటి ప్రమాదం ఉండదు.
కానీ, స్వచ్ఛమైన నైట్రోజన్ను పీల్చడం ప్రాణాంతకం. స్వచ్ఛమైన నైట్రోజన్ను పీల్చడం వల్ల శరీరానికి ఆక్సిజన్ అందదు. ఫలితంగా సెకన్ల వ్యవధిలోనే వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతాడు.
మరణ శిక్ష అమలులో భాగంగా యూజీన్ను ఓ చిన్న గదిలో బంధిచి అతని చేత కేవలం 100 శాతం స్వచ్ఛమైన నైట్రోజన్ వాయువును పీల్చేలా చేశారు.
యూజీన్కి మరణ దండన ఇదే తొలిసారి కాదు
యూజీన్ కి మరణదండన విధించడం ఇదే తొలిసారి కాదు. అతను గతంలో ఒకసారి చావు అంచుల దాకా వెళ్లి తిరిగి వచ్చాడు.
అతనికి గతంలో అత్యంత ప్రమాదకరమైన విషంతో మరణశిక్ష విధించారు. అది మొత్తం రెండు డోసులు వేయాల్సి ఉంటుంది. 2022లో ఆ శిక్షను అమలు చేసేందుకు అన్నీ ఏర్పాట్లు చేశారు.
అయితే, ఆ ఇంజెక్షన్ ఒక డోసు ఇవ్వగానే విలవిల్లాడిపోయాడు. నిర్దిష్ట సమయంలోనే రెండో డోసు కూడా ఇవ్వాలి. కానీ, యూజీన్ అటూ ఇటూ కదలడంతో రెండో డోసు ఇవ్వలేకపోయారు.
అలా తప్పని పరిస్థితుల్లో పోలీసులే అతడిని ఆస్పత్రిలో చేర్పించి ప్రాణం కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే కోర్టు ఇప్పుడు ఇలాంటి ఒక మరణశిక్షను విధించింది.
యూజీన్ కెన్నెత్ చేసిన నేరం ఏంటి
ఎలిజబెత్ సెనెట్ అనే మహిళ భర్త ఒక మత బోధకుడు. అతను బాగా అప్పుల్లో కూరుకుపోయాడు. వాటి నుంచి ఎలా బయటపడాలో అతనికి అర్థం కాలేదు.
అందుకని ఒక ఘోరమైన పథకాన్ని రచించాడు. తన భార్య పేరిట ఒక ఇన్సూరెన్స్ పాలసీని తీసుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరు కిరాయి గూండాలను మాట్లాడాడు.
ఇద్దరికీ చెరికో లక్ష ముట్టజెప్పాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు గూండాలు ఎలిజబెత్ సెనెట్ ను అత్యంత కిరాతకంగా హత్య చేశారు.
ఆ హత్య చేసిన కిరాయి గూండాల్లో కెన్నెత్ యూజీన్ స్మిత్ కూడా ఒకడు. ఇప్పుడు అతని నేరం రుజువు కావడంతో అతనికి అత్యంత దారుణంగా నైట్రోజన్ హైపోక్సియా ద్వారా మరణ శిక్షను విధించారు.
Also Read : ఆడ్వాణీ ఎన్నాళ్లకు గుర్తొచ్చాడు మోదీ..?
