security of Manipur:మణిపూర్ భద్రత బాధ్యత ఇక కేంద్రానిదేనా

security of Manipur :

అంతర్గత కల్లోలాలు, బయటి దేశాల చొరబాట్లతో ఒక రాష్ట్రం ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు దాన్ని రక్షించే అధికారాన్ని కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 355ను ఉపయోగిస్తుంది.

ఈ ఆర్టికల్ ప్రకారం “బయటి దేశం నుంచి దాడులను, లేదా అంతర్గత కల్లోలాలతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని కాపాడడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత”. సాధారణంగా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి ముందు ఈ ఆర్టికల్ 355 ను అమలు చేస్తారని ఒక భావన. మణిపూర్ లో ఆర్టికల్ 355 అమలు అవుతోందని ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ సోమవారం అఖిలపక్ష సమావేశంలో వెల్లడించారు. గతేడాది అల్లర్లు ప్రారంభమైన మే నెల నుంచే ఇది అమలు అవుతోందని చెప్పారు. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. మణిపూర్ లో ఆర్టికల్ 355 విధించారన్న వార్తలు ఇదే మొదటిసారి కాదు. ఎనిమిది నెలల క్రితం మనపూర్ పోలీసు ఉన్నతాధికారులు కూడా రాష్ట్రంలో ఆర్టికల్ 355 అమలవుతోందని చెప్పారు. అయితే సీఎం ప్రకటన చేయడం ఇదే తొలిసారి. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పకుండా ఇన్ని నెలలు ఎందుకు దాచి పెట్టారని ప్రశ్నించాయి. ఈ ఆర్టికల్ ను అమలు చేస్తే కేంద్రం రాష్ట్రంలోకి అదనపు బలగాలను పంపించి శాంతి భద్రతలను కాపాడటానికి చర్యలు తీసుకుంటుంది.

రాష్ట్రపతి పాలన అంటే?
ఒక రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగా క్షీణించినప్పుడు, రాజ్యాంగ వ్యవస్థలు పూర్తి విఫలమైనప్పుడు ఆ రాష్ట్రంలోని ప్రభుత్వాన్ని తొలగించి పరిపాలన బాధ్యతలు మొత్తం కేంద్రం తన ఆధీనంలోకి తీసుకుంటుంది. రాష్ట్రపతి గవర్నర్ సాయంతో పాలన నడిపిస్తారు. దీన్నే రాష్ట్రపతి పాలన అంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ఇందుకు అవకాశం కల్పిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 120 సార్లు వివిధ సందర్భాలలో, పలు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించారు

మణిపూర్ లో అల్లర్లు ఎందుకు?
మణిపూర్ లో మెజారిటీ ప్రజలు మైతేయీలు. మైదాన ప్రాంతాల్లో ఉంటారు. మరో తెగ కుకీలు. వీరు కొండ ప్రాంతాల్లో ఉంటారు. కుకీలు ఎస్టీలు. అయితే, తమకు కూడా ఎస్టీ గుర్తింపు కావాలని మైతేయీలు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం, హైకోర్టు తీర్పు కూడా అనుకూలంగా రావడం కుకీల్లో ఆగ్రహానికి కారణమైంది. హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా 10 నెలల క్రితం కుకీలు చేపట్టిన ర్యాలీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అప్పటినుండి మణిపూర్లో ప్రారంభమైన ఘర్షణలు ఇంకా చల్లారలేదు. కుకీలు మైతేయీలు పరస్పరం దాడులు చేసుకుంటూ ఒకరినొకరు చంపుకుంటున్నారు.

security of Manipur

Also Read:UCC bill:ఆ రాష్ట్రంలో అత్యంత వివాదాస్పద బిల్లు

Also Read:UCC bill:ఆ రాష్ట్రంలో అత్యంత వివాదాస్పద బిల్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *