Rohit Sharma :అత్యుత్తమ నాయకుడు అతడే!

Rohit Sharma :

దుబాయ్‌: భారత సారథి రోహిత్‌ శర్మకు ఐసీసీ అరుదైన గౌరవం ఇచ్చింది.

గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో జట్టును ఫైనల్‌ చేర్చిన హిట్‌మ్యాన్‌కు ఐసీసీ వన్డే టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేసింది.

గతేడాది అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనల ఆధారంగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి మంగళవారం జట్టును ప్రకటించింది.

వన్డే క్రికెట్‌లో దుమ్మురేపుతున్న ఐదుగురు భారత ఆటగాళ్లు ఇందులో చోటు దక్కడం విశేషం.

రోహిత్‌తో పాటు మరో యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, కుల్దీప్‌ యాదవ్‌, మహమ్మద్‌ సిరాజ్‌, మహమ్మద్‌ షమీ ఐసీసీ వన్డే టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌లో చోటు దక్కించుకున్నారు.

ఆసీస్‌, భారత్‌కే ఎక్కువ చాన్స్‌

గతేడాది భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్లి.. వరుసగా 10 మ్యాచ్‌లు నెగ్గిన రోహిత్‌ సారథ్యంలోని టీమ్‌ఇండియా ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే.

దీంతో ఐసీసీ వార్షిక జట్టులో ఎక్కువగా భారత్‌, ఆస్ట్రేలియా ఆటగాళ్లకే ప్రాధాన్యతనిచ్చింది. కంగరూ టీమ్‌ నుంచి ట్రావిస్‌ హెడ్‌, ఆడమ్‌ జంపా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.

భారత్‌ నుంచి ఆరుగురు ఈ జాబితాలో ఉండగా.. ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు ఉన్నారు.

ఇక మిగిలిన మూడు బెర్తులను దక్షిణాఫ్రికా ప్లేయర్లు హెన్రిచ్‌ క్లాసెన్‌, మార్కో జాన్సెన్‌, న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ డారిల్‌ మిషెల్‌ దక్కించుకున్నారు.

సెమీఫైనల్‌కు చేరిన జట్లలోని ప్లేయర్లను మాత్రమే ఐసీసీ ఈ జట్టులో చోటు కల్పించింది.

టెస్టు జట్టులో స్పిన్‌ ద్వయం

ఇక గతేడాది టెస్టు ప్రదర్శనల ఆధారంగా.. ఐసీసీ టెస్టు టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ను ఎంపిక చేసింది. ఇందులో భారత్‌ నుంచి ఇద్దరు స్పిన్‌ ఆల్‌రౌండర్లకు చోటు దక్కింది.

రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇందులో భాగస్వాములు కాగా.. ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

ఇప్పటికే ప్రకటించిన టీ20 జట్టులో భారత్‌ నుంచి కెప్టెన్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌, యశస్వి జైస్వాల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ ఎంపికైన విషయం తెలిసిందే.

టెస్టు జట్టుకు ఓపెనర్లుగా ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్‌ ఖవాజా, శ్రీలంక ప్లేయర్‌ దిముత్‌ కరుణరత్నె ఎంపక కాగా.. కేన్‌ విలియమ్సన్‌, జో రూట్‌, గ్రావిస్‌ హెడ్‌ మిడిలార్రడర్‌లో ఆడనున్నారు.

వికెట్‌ కీపర్‌గా ఆసీస్‌ ఆటగాడు అలెక్స్‌ కారీకి చోటు దక్కగా.. ఆల్‌రౌండర్ల కోటాలో జడేజా, అశ్విన్‌ చోటు దక్కించుకున్నారు.

పేస్‌ ఆల్‌రౌండర్‌గా కమిన్స్‌తో పాటు స్టార్క్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌ ఇందులో చోటు దక్కించుకున్నారు. ఇంగ్లండ్‌ మాజీ పేసర్‌ బ్రాడ్‌ కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన అనంతరం టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడం గమనార్హం.

 

Also Read : కాంగ్రెస్ లో ఎవరి ఇష్టం వారిదే?

Hyper Aadi Interveiw
Hyper Aadi Interveiw

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *