Congress MP Sania :
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఓ సంచలనం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారణి సానియా మీర్జాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆమె పేరును టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ అజారుద్దీన్ ప్రతిపాదించినట్లు సమాచారం. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ లాంటి పెద్ద నాయకుడిపై ఎవరిని అభ్యర్థిగా నిలిపినా.. అంతగా ప్రభావం చూపరని, సానియా లాంటి పాపులారిటీ ఉన్న వ్యక్తిని బరిలోకి దించితే ఇటు పార్టీ బలానికి తోడు, ఆమె స్టార్ ఇమేజ్ కూడా కలిసి వస్తుందని హస్తం నేతలు భావిస్తున్నారు.
ఇదే విషయంపై కాంగ్రెస్ నేతలు సానియాతో చర్చించినట్లు సమాచారం. ఈ చర్చల్లో సానియాకు బంధువైన అజరుద్దీన్ కూడా పాల్గొన్నట్లు తెలిసింది. సానియా సోదరి ఆనం మీర్జాను అజరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ వివాహమాడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో సానియా పోటీపై అజర్ ఆసక్తి కనబరిచినట్లు సమాచారం. కాగా, తెలంగాణలో ఇంకా పెండింగ్ లో ఉన్న ఎనిమిది స్థానాలకు నేడు అభ్యర్థులు ఖరారయ్యే అవకాశం ఉంది. బుధవారం ఢిల్లీ లో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో జాబితాను ఖరారు చేయనున్నారు.
Also Read This Article : ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎనౌకౌంటర్
