Navatihi Utsavam 2024 :
జూలైలో నిర్వహిస్తామన్న అధ్యక్షుడు మంచు విష్ణు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణుకు ఎట్టకేలకు తన హోదా, బాధ్యత గుర్తుకొచ్చాయి. అధ్యక్షుడిగా ఎన్నికై రెండేళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో.. ‘మా’ సభ్యుల బాగోగుల కోసం నిధుల సమీకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం ఓ భారీ వేడుకను నిర్వహించే యోచనలో ఉన్నట్టు మంచు విష్ణు ప్రకటించారు. మలేషియా వేదికగా జూలై నెలలో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ‘మా’ ఎన్నికల్లో సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ తో పోటీ పడి.. అధ్యక్షుడిగా గెలుపొందిన విష్ణు.. ఎన్నికల సమయంలో పలు హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే.
అందులో ప్రధానంగా ‘మా’ సభ్యత్వం కలిగిన నటీనటులకు బీమా సౌకర్యం కల్పించడం ఒకటైతే.. ‘మా’ అసోసియేషన్ కార్యాలయానికి సొంత భవనం నిర్మాణం మరొకటి.‘మా’ కార్యాలయాన్ని తన సొంత డబ్బుతోనే నిర్మిస్తానని కూడా విష్ణు చెప్పారు. కానీ, రెండేళ్లయినా.. కార్యాలయానికి అతీగతీ లేదు. నటీనటుల బీమా ఊసే లేకుండా పోయింది. మరికొద్ది నెలల్లో అసోసియేషన్ కు మళ్లీ ఎన్నికలు వస్తాయి. ఈ నేపథ్యంలో తన హామీలను కొంతమేరకైనా నెరవేర్చాలని విష్ణు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మలేషియాలో వేడుకను తెరపైకి తెచ్చినట్లు అర్థమవుతోంది. ‘మా’ కార్యకవర్గ సభ్యులతో కలిసి శనివారం మీడియాకు ఈ విషయాన్ని విష్ణు వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “90 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న తెలుగు సినిమా కోసం ఓ భారీ ఈవెంట్ చేయాలని రెండేళ్ల క్రితం అనుకున్నాం. అయితే ఇలాంటి వేడుక చేశామంటే సక్సెస్ఫుల్గా ఉండాలి. అందుకే సమయం తీసుకుని ఓ ప్రణాళికతో ముందుకెళ్ల బోతున్నాం. నవతిహి పేరుతో మలేషియాలో చరిత్రాత్మక ఈవెంట్ చేయనున్నాం’’ అని మంచు విష్ణు అన్నారు.
‘మా’ సభ్యుల బాగోగుల కోసం నిధుల సమీకరణ కార్యక్రమం
రెండేళ్ల క్రితమే ఈవెంట్ చేయాలనుకున్నా.. అనేక కారణాల వల్ల ఉత్సవం వాయిదా పడుతూ వచ్చిందన్నారు. ‘‘ఇలాంటి ఈవెంట్స్ గతంలో కూడా జరిగాయి. అప్పటి టీమ్ కూడా మంచిగా ఫండ్ రైజింగ్ చేసింది. ఇప్పుడు అంతకుమించి ఫండ్ రైజ్ అయ్యేలా భారీగా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. అందుకే ఈవెంట్ను జూలైలో మలేషియాలో చేయదలిచాము. సినీ పరిశ్రమ పెద్దలతో మాట్లాడి తేదీని ప్రకటిస్తాం. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు గోల్డెన్ ఎరా నడుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావటం గొప్ప విషయం. కీరవాణి గారు ఆస్కార్ అందుకోవడం, అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డ్ రావడం, ప్రభాస్ హయ్యెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్ కావడం, మహేష్ రాజమౌళి గారి సినిమా ఏషియాలోనే బిగ్గెస్ట్ సినిమా కాబోతుంది. తెలుగు సినిమా ఇన్ని ఘనతలు సాధించిన ఈ సమయంలో ఇలాంటి ఉత్సవం చేయడం కరెక్ట్ అనిపించింది. ఈ విషయం గురించి ఛాంబర్ పెద్దలతో మాట్లాడాము. రెండు, మూడు రోజులు ఇండస్ట్రీకి సెలవు ఇవ్వాలని కోరాం.దిల్ రాజు, దాము గారు సపోర్ట్ చేస్తామన్నారు. ఇతర చిత్రపరిశ్రమల నుంచి కూడా సపోర్ట్ ఉంది. ఇతర చిత్ర పరిశ్రమల నుంచి కూడా సపోర్ట్ బావుంది. తెలుగు సినిమా ఘనకీర్తిని చాటిచెప్పేలా నవతి ఈవెంట్ చేయబోతున్నాం’’ అని విష్ణు అన్నారు.
Also Read This Article : రికార్డుల్లో తగ్గేదేలే.. ఐకాన్స్టార్ అల్లు అర్జున్
