RGV Shapadham : ఆర్జీవి చెప్పే పచ్చినిజాలు ఏపి ఫైబర్‌ నెట్‌ ఓటిటిలో….

RGV Shapadham :

రాజు కంటే మొండివాడు గొప్పవాడు అనేది పాత సామెత….లోకేష్‌ కంటే మొండివాడు రామ్‌గోపాల్‌ వర్మ అనేది కొత్త సామెత…అదెలా అంటే..

చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్, నారా లోకేశ్‌లపై మరో బాణాన్ని ఎక్కుపెట్టాడు ప్రముఖ దర్శకనిర్మాత రామ్‌గోపాల్‌ వర్మ. నిన్న మొన్నటివరకు తన దర్శకత్వంలో తయారైన ‘వ్యూహం’ ‘శపథం’ సినిమాలను విడుదల చేసుకోవటానికి నానా బాధలు పడ్డ సంగతి తెలిసిందే. ఎట్టకేలకు మార్చి 2వ తేదిన ‘వ్యూహం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలాకాలం తర్వాత రాము సినిమా పరవాలేదు అనిపించుకున్నాడు ‘వ్యూహం’ సినిమాతో. ఈ సినిమా తర్వాత మరో పార్టు ‘శపథం’ విడుదల కావల్సి ఉండగా సడెన్‌గా వెరైటీ బాంబ్‌ పేల్చారు ఆర్జీవి.

తన దర్శకత్వంలో రాబోయో కొత్త ప్రాజెక్ట్‌ ‘శపథం ఆరంభం చాప్టర్‌1’ మార్చి 7వ తేది రాత్రి 8 గంటలకు అలాగే ‘శపథం అంతం చాప్టర్‌–2’ మార్చి 8వ తేది రాత్రి 8 గంటలకు ఏపి ఓటిటి ఫైబర్‌ నెట్‌ యాప్‌ ద్వారా పే ఫర్‌ వ్యూ లో చూసే వెసులుబాటును కల్పిస్తున్నాం అన్నారు. ఆ తర్వాత అన్ని ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో రిలీజ్‌ చేస్తున్నారట ఆర్జీవి. ఈ రెండు వెబ్‌ సిరీస్‌ల్లోను ఏది దాచకుండా తీసినది తీసినట్లు చూపించటానికే అని ఆర్జీవి బలంగా చెప్తున్నాడు. చూద్దాం వాటిల్లో ఎంత నిజముంటుందో ఏమో? ఆర్జీవికి దేవుడికే తెలియాలి అని ప్రేక్షకులు గుసగుసలాడుతున్నారు. ఏదేమైనా మొండోడు రాజుకంటే గొప్పవాడు అని రామ్‌గోపాల్‌ వర్మ తన సినిమాల విడదలను ఇలా దొడ్డిదారిలో ఐనా ప్రజలకు చేరవేయటం మాత్రం మాస్టర్‌ ప్లాన్‌ అని అనుకోవచ్చు. చూడాలి ఈ కొత్త ప్రయోగమైనా ఫలిస్తుందా రాము గారు? లేక బెడిసికొడుతుందా? అనేది వేచి చూడాల్సిందే….
శివమల్లాల

Also Read This : ప్రశాంత్ కిశోర్.. ఈ ప్రశ్నలకు బదులేది..?

KGF Balakrishna Exclusive Interview
KGF Balakrishna Exclusive Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *