Sai Abshishek
యువ నిర్మాత సాయి అభిషేక్.. ఎమోషనల్ థ్రిల్లర్ లవ్ స్టోరీ మూవీ ‘28°C’ తో నిర్మాతగా పరిచయం కాబోతున్నారు.
వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్పై నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి హీరో హీరోయిన్లుగా ఈ సినిమాను నిర్మించారు.
అనిల్ విశ్వనాథ్ తన మొదటి సినిమాగా ‘28°C’ రూపొందించారు.
ఈ సినిమా ఈ నెల 4వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్కు సిద్ధమవుతోంది.
మంగళవానం ‘28°C’ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను నిర్మాత సాయి అభిషేక్ తెలిపారు.
దర్శకుడు అనిల్, తాను చాలా మంచి స్నేహితులమని సినిమాపై ఇద్దరికీ ప్యాషన్ ఉండేదన్నారు.
కొద్ది రోజుల క్రితమే కలిసి మూవీ చేద్దామని తామిద్దరం డిసైడ్ అయినట్టు తెలిపారు.
ఈ క్రమంలోనే ‘28°C’టెంపరేచర్ పాయింట్తో అనిల్ విశ్వనాథ్ చెప్పిన కథ తనను ఇంప్రెస్ చేసిందన్నారు.
ప్రేక్షకులకు కూడా ఇది కొత్త అనుభూతిని ఇస్తుందనే నమ్మకంతో మూవీ స్టార్ట్ చేశామని తెలిపారు.
మొదట ఈ మూవీకి వేరే హీరోలను అనుకున్నామని.. నవీన్ చంద్ర అయితే బాగుంటుందనే నిర్ణయించామన్నారు.
తొలుత హీరోయిన్గా అంజలిని అనుకున్నామని.. ఆ తరువాత కొత్త ఫేస్ అయితే బాగుంటుందని షాలినీని తీసుకున్నట్టు తెలిపారు.
2019లోనే ఈ సినిమా సిద్ధమైందని.. అయితే కరోనా పాండమిక్ కారణంగా సినిమా విడుదల చేయడం కుదరలేదన్నారు.
థియేటర్స్లోనే విడుదల చేయాలనే సంకల్పంతో కొంత కాలం వేచి చూశామన్నారు.
చివరకు వంశీ నందిపాటి గారి ఇనిషియేటివ్తో ఈ నెల 4న మా “28°C” సినిమాను థియేట్రికల్గా రిలీజ్ చేయబోతున్నామని సాయి అభిషేక్ వెల్లడించారు.
హీరో నవీన్ మాకు అన్ని విధాలుగా తన సహాయ సహకారాలు అందిస్తున్నాడని తెలిపారు.
‘28°C’ టెంపరేచర్లో హీరోయిన్ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఆ టెంపరేచర్ కారణంగా ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం.. ఇలాంటి పరిస్థితిని ఈ జంట ఎలా ఎదుర్కొన్నారు? అనేది ఆసక్తికరంగా ఉంటుంది.
ఒకే జానర్లో ఈ మూవీ సాగకుండా.. డిఫరెంట్ జానర్స్లో వెళ్తూ ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఆకట్టుకుంటుంది.
డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఆద్యంతం ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేలా మూవీ రూపొందించాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని సాయి అభిషేక్ తెలిపారు.
ప్రజావాణి చీదిరాల
Also Read This : ‘మెగా 157’.. ఇలాంటి ప్రమోషన్స్ ఎప్పుడూ చూడలే..
